హైదరాబాద్ నగరంలోని నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుతుందని ఆ మెయిల్ లో పేర్కొన్నారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులను కోర్టు నుంచి బయటకు పంపించి, బాంబు నిర్వీర్య దళాలతో తనిఖీలు చేపట్టారు.
కోర్టు లోపల, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చిన ఈ బెదిరింపు సందేశంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా బాంబు జాడ కనిపించలేదు.. గతంలోనూ ఇలాంటి బాబు బెదిరింపులు నగరంలోని పలు కోర్టులకు వచ్చాయి.










Comments are closed