Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • desk
  • Medaram jatara : మేడారంలో కీలకఘట్టం గద్దెపైకి సమ్మక్క..

Medaram jatara : మేడారంలో కీలకఘట్టం గద్దెపైకి సమ్మక్క..

తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరలో నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువుదీరనుంది. గిరిజన పూజారులు సాయంత్రం చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న తల్లినితెచ్చి ప్రతిష్ఠిస్తారు.


సమ్మక్క-సారలమ్మలు ఇద్దరు గద్దెలపై కొలువుదీరిన తర్వాత ఆ వనదేవతలను దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అయితే జాతరలో సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకొచ్చే ప్రక్రియ చాలా సవాలుతో కూడిన పనే చెప్పాలి. సమ్మక్క తల్లి చివరిసారిగా అదృశ్యమైన చిలకల గుట్టపైకి వెళ్లి గిరిజన పూజరి అమ్మవారిని కుంకుమ భరిణె రూపంలో తీసుకుని వస్తుంటారు. సమ్మక్క తల్లి చిలకలగుట్ట కిందకు వచ్చే సమయంలో గౌరవసూచకంగా జిల్లాఎస్పీ గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఆ సమయంలో వాతావరణం ఉద్వేగభరితంగా ఉంటుంది. ఇక మేడారం వన జాతరలో తొలిరోజు సారలమ్మను గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు.

Comments are closed

Related Posts