తెలంగాణలోని కామారెడ్డిలో బాంబులు కలకలం రేపాయి.. కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామ శివారులోని మొగుళ్ల సాయగౌడ్ రైతుకు చెందిన పొలంలో బాంబుపేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఓ కుక్క అక్కడికక్కడే మృతిచెందింది. బాంబు పేలుడు ఘటనతో భారీ శబ్దంతో పాటు ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు, రైతులు ఉలిక్కిపడ్డారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తమ పొలాల్లో బాంబులు పెట్టి వెళ్లారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.















Comments are closed