Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • National
  • Financial Changes : 2025లో సామాన్యుడిపై ప్రభావం చూపిన ఆర్థిక మార్పులు..

Financial Changes : 2025లో సామాన్యుడిపై ప్రభావం చూపిన ఆర్థిక మార్పులు..

2025లో చాలా ఆర్థిక మార్పులు చోటు చేసుకున్నాయి. పన్ను తగ్గింపులు, వడ్డీ రేట్లు తగ్గడం వల్ల కొంత ఊరట దొరకగా, రూపాయి విలువ పడిపోవడం, ఇతర కారణాల వల్ల కొత్త సమస్యలు ఎదురయ్యాయి. ఈ సంవత్సరంలో సామాన్యుడికి ఎక్కువగా ప్రభావం చేసిన ప్రధాన మార్పులు ఇవే:

  1. జీఎస్టీ మార్పులు
    సెప్టెంబర్ 2025లో ప్రభుత్వం జీఎస్టీ slabsను సరళీకరించింది. ఇప్పుడు రెండు slabs మాత్రమే ఉన్నాయి – 5% మరియు 18%. కానీ, కొన్ని ప్రీమియం వస్తువులపై 40% కొత్త slab పెట్టారు. సబ్బు, టూత్‌పేస్ట్లు లాంటి వస్తువుల ధరలు తగ్గాయి. ఏసీలు, టీవీలు, చిన్న కార్లపై పన్ను తగ్గడంతో వాటి ధరలు కూడా తగ్గాయి.
  2. హోమ్ లోన్ ఈఎమ్ఐలు తగ్గిపోయాయి
    RBI రెపో రేట్లు నాలుగు సార్లు తగ్గించడంతో హోమ్ లోన్ వడ్డీలు తగ్గాయి. అందువల్ల ఏడాది లావున నెలకి సుమారు రూ.3,500-4,000 వరకు తక్కువ ఇవ్వాలి.
  3. రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు
    2025 బడ్జెట్‌లో కొత్త ట్యాక్స్ పాలసీ ప్రకారం, ఏడాదికి రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. దీని వల్ల మందికి ఎక్కువ డబ్బు చేతిలో మిగిలింది.
  4. రూపాయి విలువ తగ్గింది
    Dollarతో పోలిస్తే రూపాయి విలువ రూ.91కి పడిపోయింది. దీనిని వల్ల దిగుమతి వస్తువులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోల్, వంట నూనె ధరలు పెరిగాయి. విదేశీ ప్రయాణ ఖర్చులు కూడా పెరిగాయి.
  5. ఎలక్ట్రిక్ కార్లు చౌక అయ్యాయి
    లిథియం ధరలు తగ్గడం, మారిన ట్యాక్స్‌ వల్ల ఈవీ కార్లు 15-20% వరకూ చౌక అయ్యాయి.
  6. బీమాపై జీఎస్టీ రద్దు
    జీవిత బీమా, ఆరోగ్య బీమాపై GST ఎత్తివేశారు. బీమా ప్రీమియం తక్కువగా పెట్టొచ్చు.
  7. రైలు, రోడ్ల అభివృద్ధి
    100% రైల్వేలు విద్యుదీకరణ అయిపోయాయి. రహదారులు విస్తరించాయి. వాహన ప్రయాణ ఖర్చులు తక్కువయ్యాయి.
  8. అమెరికా టారిఫ్ కారణంగా చిన్న మార్పులు
    అమెరికా టారిఫ్‌తో కొన్ని వస్తువులు చౌకగా దొరికినా, ప్యాక్ చేసిన నిత్యావసర వస్తువుల ధరలు కొద్దిగా పెరిగాయి.
  9. యూపీఐ ఆధారిత క్రెడిట్ కార్డులు
    చిన్న వ్యాపారులకు, గిగ్ వర్కర్లకి రూ.30,000 వరకు సులభంగా రుణం అందించే యూపీఐ క్రెడిట్‌ కార్డు వచ్చింది.
  10. వ్యవసాయ పరికరాలు చౌక
    వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించారు. రైతులకు ఖర్చు తగ్గింది, ఫలితంగా వంట తినే వస్తువుల ధరలు నియంత్రితంగా ఉన్నాయి.

సంక్షిప్తంగా చెప్పాలంటే: 2025లో పన్నులు, వడ్డీలు తక్కువయ్యాయి, కానీ రూపాయి విలువ పడిపోవడం వంటి సమస్యలు కూడా వచ్చాయి. మొత్తంగా, ఈ మార్పులు సామాన్యుడి జేబుపై ప్రభావం చూపాయి.

Comments are closed

Related Posts