మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మానవీయతకు అద్దం పట్టే సంఘటన చోటుచేసుకుంది. నడవలేని స్థితిలో ఉండటంతో న్యాయస్థానం మెట్లు ఎక్కలేని ఓ కక్షిదారురాలి ఇబ్బందిని తెలుసుకున్న తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి స్వయంగా ఆమె వద్దకు వెళ్లి వాంగ్మూలం స్వీకరించారు.
కోర్టుకు హాజరుకావడం శారీరకంగా సాధ్యం కాని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, న్యాయం అందాల్సిందే అన్న ఉద్దేశంతో న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. కక్షిదారురాలి ఇంటికి వెళ్లి చట్టబద్ధంగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడం ద్వారా న్యాయవ్యవస్థలో మానవీయ కోణాన్ని మరోసారి చాటిచెప్పారు.
ఈ ఘటన న్యాయానికి ప్రతి ఒక్కరికీ సమాన ప్రాప్యత ఉండాలన్న సందేశాన్ని సమాజానికి బలంగా చాటి చెప్పింది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి న్యాయం దూరం కాదని ఈ చర్య నిరూపించింది. న్యాయమూర్తి తీసుకున్న ఈ మానవీయ నిర్ణయానికి న్యాయవాదులు, స్థానికులు అభినందనలు తెలియజేస్తున్నారు.












Comments are closed