తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ నేతలకు అధిష్ఠానం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా పనబాక లక్ష్మి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా షణ్ముగం, అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్, ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డి, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు , నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ధర్మవరపు సుబ్బారెడ్డి, విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బడేటి చంటి, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జోత్యుల నవీన్, బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్ లను టీడీపీ అధిష్టానం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.















Comments are closed