తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నాడీఎంకే పోస్టర్లను ప్రదర్శిస్తూ వీడియో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. తిరుమల కొండపై రాజకీయ ప్రచారాలు, పార్టీల గుర్తులు ప్రదర్శించడంపై నిషేధం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా తమిళనాడు భక్తులు ప్రవర్తించడంపై తితిదే స్పందించింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తితిదే సీపీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు.









Comments are closed